అడ్డంగా నిలబడతాం! పవన్ కల్యాణ్ సంచలన పోస్టు!
Fri May 16, 2025 19:02 Politics.202505161210.jpg)
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి తన దేశ భక్తిని చాటారు. భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల దృష్ట్యా జాతీయ భద్రత కోసం జనసేన సర్వమత ప్రార్థనలు, సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలిపిన జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు ఒక్కరూ సమిష్టిగా, బలంగా నిలబడదాం.. భారత దేశపు ఐక్యతను చాటి చెప్పుదామని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.
జమ్మూ & కాశ్మీర్, పహాల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కదిలించింది. ఇలాంటి సమయంలో "ఆపరేషన్ సిందూర్" ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలను ప్రదర్శించి, భారత్ కు రక్షణ కవచంలా నిలచిన భద్రతా దళాలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్న్యూస్..! ఒక్క క్లిక్తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!
ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారత దేశానికి, రక్షణ బలగాల రక్షణ కోసం తమిళనాడు లోని దేవ సేనాని శ్రీ సుబ్రమణ్య స్వామి వారి 6 షష్ట షణ్ముఖ ఆలయాల్లో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 సుబ్రమణ్య స్వామి ఆలయాల్లో, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో, అరసవల్లి శ్రీ సూర్య నారాయణ ఆలయంలో, ఇతర ఆలయాలు, మసీదుల్లో, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేసిన @JanaSenaParty నాయకులకు, జనసైనికులు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ PAC చైర్మన్, మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, MLC శ్రీ పిడుగు హరిప్రసాద్, మంత్రి శ్రీ కందుల దుర్గేష్, ఎంఎల్ఏ లు శ్రీ ఆరణి శ్రీనివాసులు, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ పంతం నానాజీ, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ బోలిశెట్టి శ్రీనివాస్, శ్రీ అరవ శ్రీధర్, శ్రీ బత్తుల బలరామకృష్ణ, శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ నిమ్మక జయకృష్ణ గార్లకు, AHUDA చైర్మన్ శ్రీ T.C వరుణ్, KUDA చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి, పిఠాపురం ఇంచార్జి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గార్లకు, అలాగే మతాలకు అతీతంగా ఈ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్క నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు.
భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు ఒక్కరూ సమిష్టిగా, బలంగా నిలబడదాం, భారత దేశపు ఐక్యతను చాటి చెపుదాం.. అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అర్ధగంటలో అబుదాబీ నుంచి దుబాయ్కి ప్రయాణం..! UAE రైలు రంగంలో రికార్డ్!
ఏపీలోని వారందరికీ గుడ్న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!
తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!
ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్కు షాక్..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!
మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!
వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!
వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!
సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్కు విజ్జప్తి చేస్తూ లేఖ!
కడప మేయర్ కు భారీ షాక్! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!
చంద్రబాబు నేతృత్వంలో పొలిట్బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #PawanKalyan #JanaSena #PowerStar #StandFirm #PoliticalStatement #AndhraPolitics
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.